TGSRTC Electric Buses: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) మరో 118 JBM ఎలక్ట్రిక్ బస్సులకు భద్రతా అనుమతి (ఫిట్నెస్ క్లియరెన్స్) ఇచ్చింది. దీంతో ఇప్పటికే సేవల్లోకి వచ్చిన బస్సులతో కలిపి మొత్తం 268 ఎలక్ట్రిక్ బస్సులు రాష్ట్రవ్యాప్తంగా తిరిగి ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి.

TGSRTC Electric Buses 500 బస్సుల్లో 268 ఇప్పటికే సేవల్లోకి
TGSRTC వద్ద మొత్తం 500 JBM ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. వీటిలో గతంలో 150 బస్సులకు అనుమతి ఇవ్వగా, తాజాగా మరో 118 బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేశారు. మిగిలిన బస్సుల భద్రతా పరీక్షలు పూర్తయ్యాక వాటిని కూడా త్వరలో రోడ్డెక్కించనున్నారు.
ప్రతి బస్సుకు ప్రత్యేకంగా భద్రతా పరీక్షలు
ప్రతి బస్సును TGSRTC సాంకేతిక నిపుణులు, JBM ఇంజినీర్లు, చైనా నుంచి వచ్చిన బ్యాటరీ నిపుణులు కలిసి పూర్తిగా పరిశీలిస్తున్నారు. హైదరాబాద్లోని బస్ భవన్లో ఏర్పాటు చేసిన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన తర్వాతే “Fit for Operation” సర్టిఫికెట్ ఇచ్చి బస్సును తిరిగి సేవల్లోకి అనుమతిస్తున్నారు.
ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా అదనపు బస్సులు
JBM ఎలక్ట్రిక్ బస్సులు ఇంకా అందుబాటులో లేని మార్గాల్లో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా అదనపు బస్సులను నడపాలని TGSRTC మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగిరెడ్డి ప్రాంతీయ మేనేజర్లకు ఆదేశాలు జారీ చేశారు.
TGSRTC Electric Buses బస్సులను ఎందుకు నిలిపివేశారు?
జూన్ 21న కరీంనగర్ జిల్లా ఆలుగునూర్ సమీపంలో JBM ఎలక్ట్రిక్ బస్సులో బ్యాటరీకి సంబంధించిన అగ్ని ప్రమాదం జరిగింది. అలాగే మరికొన్ని ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంతో జూలై 2న రాష్ట్రవ్యాప్తంగా అన్ని JBM ఎలక్ట్రిక్ బస్సులను TGSRTC తాత్కాలికంగా నిలిపివేసింది.ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్రతి బస్సును పూర్తిగా పరీక్షించిన తర్వాతే తిరిగి సేవల్లోకి అనుమతిస్తోంది.
Read More News: https://www.telanganapatrika.in/rrb-je-notification-2026-4098-railway-technical-posts/
