
Tirumala Darshan Update: కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. టీటీడీ తాజా వివరాల ప్రకారం, ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 15 కంపార్ట్మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు.
సర్వదర్శనానికి 8 గంటల సమయం
టోకెన్లు లేని భక్తులకు ప్రస్తుతం సర్వదర్శనం కోసం సుమారు 8 గంటల సమయం పడుతోంది. మరోవైపు SSD (టైమ్ స్లాట్) టోకెన్లు కలిగిన భక్తులు 3 నుంచి 4 గంటల్లో స్వామివారి దర్శనం పూర్తి చేసుకుంటున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు
వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లలో వేచి ఉన్న(Tirumala Darshan Update) భక్తులకు టీటీడీ అధికారులు తాగునీరు, పాలు, అన్నప్రసాదం వంటి సౌకర్యాలను నిరంతరంగా అందిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
ఒక్కరోజులో 80 వేలకుపైగా భక్తులు
మంగళవారం ఒక్కరోజే 80,167 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 28,270 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు.
హుండీ ఆదాయం ఎంత?
టీటీడీ వెల్లడించిన వివరాల ప్రకారం, మంగళవారం ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.1 కోట్లు నమోదైంది. ప్రతి రోజు వేలాది మంది భక్తులు తిరుమలను సందర్శిస్తుండటంతో ఆలయంలో భక్తుల రద్దీ పరిస్థితిని టీటీడీ నిరంతరం పర్యవేక్షిస్తోంది.
ప్రతిరోజూ తాజా వార్తలు మీ వాట్సాప్కు నేరుగా అందుకోండి — Telanganapatrika WhatsApp Channel ని ఇప్పుడే Follow చేయండి. తాజా వార్తల కోసం మా Google News పేజీని కూడా Follow చేయండి.
