Telanganapatrika (June 27): Fake Seeds Arrest Adilabad. తెలంగాణలో నకిలీ విత్తనాల వ్యాపారంపై పోలీసు విభాగం ఉక్కు పాదం మోస్తోంది. అమాయక రైతులను లక్ష్యంగా చేసుకొని నకిలీ విత్తనాలను విక్రయిస్తున్న ముఠాపై జిల్లాలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందం తనిఖీలు జరిపింది.

ఇచ్చోడా మండలంలో పట్టుబడ్డ నిందితులు
తేదీ 16 జూన్ 2025 న ఇచ్చోడ మండలంలోని దాబా బి గ్రామంలో నిర్వహించిన తనిఖీలలో నరవాటే ఈశ్వర్ అనే వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద 20 బాగ్స్ పింక్ బాండ్ 5G నకిలీ విత్తనాలు బయటపడ్డాయి. విచారణలో ఈశ్వర్, ఈ విత్తనాలను పిప్పల్వార్ సునీల్ (r/o ఆదిలాబాద్) వద్ద నుంచి తీసుకున్నానని తెలిపాడు.
Fake Seeds Arrest Adilabad ఫరారీ నిందితుడిని హైదరాబాద్లో పట్టివేత
పరారీలో ఉన్న సునీల్ ను పట్టుకునేందుకు టెక్నికల్ ట్రీమ్ను రంగంలోకి దింపిన పోలీసులు, ఆర్ గోపికృష్ణ (రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్) సూచనలతో ఇచ్చోడ ఎస్సై వి. పురుషోత్తం ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని హైదరాబాద్కు పంపి, జూన్ 27, 2025 న అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
రైతులకు హెచ్చరిక
జిల్లాలో నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టేందుకు ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఆదేశాలతో ప్రత్యేక దళాలు పనిచేస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా ఉన్న విత్తనాలను అమ్ముతున్నట్టు గమనిస్తే ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్ ఐపీఎస్ సూచనల మేరకు, వెంటనే జిల్లా పోలీసులను సంప్రదించాలి.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యకలాపంలో ఇచ్చోడ సీఐ బి. రాజు, ఎస్సై వి. పురుషోత్తం, హెడ్ కానిస్టేబుల్ విజయభాస్కర్, కానిస్టేబుళ్లు భూమేష్, విష్ణు, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu