TELANGANAPATRIKA (June 15) : DOST 2nd Phase Seat Allotment 2025. ఏడాది దోస్త్ రెండో విడత సీట్ల కేటాయింపు ప్రక్రియలో భాగంగా, శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న కళాశాలల్లో మొత్తం 4,334 సీట్లు కేటాయించబడ్డాయని యూనివర్సిటీ దోస్త్ కోఆర్డినేటర్ డా. ఎన్.వి. శ్రీరంగప్రసాద్ వెల్లడించారు.

DOST 2nd Phase Seat Allotment 2025 , SU పరిధిలో మొదటి విడత తరువాత ఖాళీల వివరాలు
ప్రధమ విడత అనంతరం సుమారు 31,726 సీట్లు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించారు. విద్యార్థుల నుంచి వచ్చిన రెండో విడత అభ్యర్థనల ప్రకారం, అందులో 4,334 సీట్లను ఎంపిక చేశారు.
రిపోర్టింగ్కు చివరి తేదీ: జూన్ 16
సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 16వ తేదీ లోపు సంబంధిత కళాశాలలలో రిపోర్ట్ చేసి సీటును రిజర్వ్ చేసుకోవాలి. లేకపోతే కేటాయించిన సీటు రద్దు అవుతుందని హెచ్చరించారు. ఈ తేదీని తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
ఇంకెప్పుడు వస్తుంది తదుపరి విడత?
విద్యార్థుల నుంచి ఇంకా ఎక్కువగా అభ్యర్థనలు వచ్చిన సందర్భంలో మూడో విడత సీట్ల కేటాయింపు కూడా ఉండే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. దోస్త్ అధికారిక వెబ్సైట్లో తాజా సమాచారం పరిశీలించాలని సూచిస్తున్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu