Jubilee Hills Bypoll: హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ప్రక్రియను ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ICCC), బంజారాహిల్స్ నుండి ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.

మంగళవారం జరిగిన ఈ ఉపఎన్నికలో డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి ప్రతి పోలింగ్ కేంద్రంలోని పరిస్థితులను రియల్ టైమ్లో పరిశీలించారు. దేశంలోనే తొలిసారి డ్రోన్ల సాయంతో ఎన్నికల పర్యవేక్షణ చేపట్టడం విశేషం. మొత్తం 150 డ్రోన్ కెమెరాలు ఎన్నికల సంఘం మార్గదర్శకత్వంలో పనిచేశాయి.
భద్రతా చర్యలు కట్టుదిట్టం
పోలింగ్ శాంతియుతంగా సాగుతోందని సజ్జనార్ తెలిపారు. 900 సీసీ కెమెరాల ద్వారా కూడా రియల్ టైమ్ మానిటరింగ్ నిర్వహిస్తున్నామని, ఓటర్లు ఎటువంటి భయాందోళన లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఓటర్లకు విజ్ఞప్తి
“ప్రతి ఓటరు బాధ్యతతో, స్వేచ్ఛగా ఓటు వేయాలి. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు,” అని సజ్జనార్ పేర్కొన్నారు.
Jubilee Hills Bypoll టెక్నాలజీతో భద్రతకు నూతన దిశ
డ్రోన్ సర్వైలెన్స్తో జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో భద్రత, పారదర్శకతకు కొత్త పంథా అందిందని అధికారులు తెలిపారు. పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన కెమెరాలు, డ్రోన్లు ఏవైనా అవకతవకలు జరగకుండా ముందుగానే గుర్తించేందుకు దోహదపడుతున్నాయని పేర్కొన్నారు.
ఈ వినూత్న టెక్నాలజీ వినియోగం రాబోయే ఎన్నికల్లో కూడా ఆదర్శంగా నిలవనుందని పోలీస్ అధికారులు అభిప్రాయపడ్డారు.
Read More: Read Today’s E-paper News in Telugu
