
TELANGANA PATRIKA(MAY29) , అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇంటి కలను నెరవేర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం సంకల్పంతో ముందుకు సాగుతోందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గురువారం మండలానికి చెందిన 391 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి పంపిణీ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్టాత్మక కార్యక్రమమని, ప్రతి అర్హుడికి స్వంత నివాసం కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పైలెట్ ప్రాజెక్టుగా సర్వపూర్ గ్రామాన్ని ఎంపిక చేసినట్టు తెలిపారు. రాజీవ్ యువ వికాస్ మిషన్ ద్వారా గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. సర్వపూర్ అంబేద్కర్ సంఘానికి బోరు కావాలని కోరగా వెంటనే స్పందించి రెండు రోజుల్లో బోరు వేయించామన్నారు. సంఘ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో వసంత, ఎంపీడీవో స్వాతి, హౌసింగ్ శాఖ ఇంజినీర్లు, ఆర్డీవో, ఆర్ఐ తిరుపతి, స్థానిక నాయకులు బత్తిని మల్లీశ్వరి శ్రీనివాస్, ముత్యం శంకర్, దారం ఆదిరెడ్డి, లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీకి చెందిన దొంగ ఆనంద్ రెడ్డి, మ్యాక్ లక్ష్మణ్, రామలింగారెడ్డి, చంద్రశేఖర్, శనిగారపు తిరుపతి, నేరెళ్ల సతీష్ రెడ్డి, బివి రమణ పటేల్, బండి రవి, ముద్దం శ్రీనివాస్, రామాంజనేయులు, కోరేపు వెంకటేష్, కంటే అరుణ్, మర్రి లక్ష్మణ్, ఎండి ఇమామ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం పేద ప్రజలలో హర్షాతిరేకాన్ని కలిగించిందని స్థానికులు పేర్కొన్నారు.

Read More: Read Today’s E-paper News in Telugu