TELANGANA PATRIKA (MAY 5) , PACS: మంజులాపూర్ పిఎసిఎస్ ఆధ్వర్యంలో కడ్తాల్ గ్రామంలో వరి కొనుగోలు కేంద్రంను సోమవారం ఏఎంసీ చైర్మన్ సోమా భీమ్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం రైతుల నుండి ధాన్యాన్ని నేరుగా కొనుగోలు చేసి గిట్టుబాటు ధర అందించే విధంగా చర్యలు తీసుకుంటోందన్నారు.

రైతుల శ్రమకు తగిన ఫలితం అందించేందుకు ధాన్యం విక్రయానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తున్నదని తెలిపారు. ముఖ్యంగా, ధాన్యం కొనుగోలు అనంతరం రైతుల ఖాతాల్లో నగదు త్వరగా జమ అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ అంపోలి కృష్ణ ప్రసాద్ రెడ్డి, వైస్ చైర్మన్ బర్మా గంగా దాస్, డైరెక్టర్లు రమేష్ రెడ్డి, నక్కల మధుకర్ రెడ్డి, పిఎసిఎస్ సెక్రటరీ శ్రీహరి, శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ సిరిగిరి వెంకట నరసయ్య, ఏఈఓ ప్రగతి, కడ్తాల్ మరియు సాకేర గ్రామ వీడిసి సభ్యులు, కేంద్ర నిర్వాహకుడు నారడీ శివరాం, పలువురు రైతులు పాల్గొన్నారు.
PACS ప్రధాన అంశాలు:
- వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం
- రైతులకు MSP (గిట్టుబాటు ధర) హామీ
- తక్షణ నగదు జమకు చర్యలు
- రైతుల హక్కులకు ప్రభుత్వ ప్రాధాన్యత
Read More: Read Today’s E-paper News in Telugu