RGIA Bomb Threat Hyderabad: హైదరాబాద్ శంషాబాద్ RGIA ఎయిర్పోర్టులో శనివారం తెల్లవారుజామున భద్రతా అధికారులను అలర్ట్ చేసిన సంఘటన చోటుచేసుకుంది. రెండుచోట్ల నుండి వచ్చిన బాంబు బెదిరింపు ఈమెయిల్తో విమానాశ్రయం హై అలర్ట్లోకి వెళ్లింది.

RGIA Bomb Threat Hyderabad ఎలాంటి విమానాలకు బెదిరింపు?
- BA 277 (Heathrow–Hyderabad)
- KU 373 (Kuwait–Hyderabad)
BA 277 విమానం ఉదయం 5:25కి సురక్షితంగా RGIAలో ల్యాండ్ అయ్యింది. వెంటనే భద్రతా సిబ్బంది విమానాన్ని పూర్తిగా తనిఖీ చేసి ఏ అనుమానాస్పద వస్తువులు లేవని నిర్ధారించారు.
అయితే KU 373 విమానం బెదిరింపు సమాచారం అందుకున్న వెంటనే తిరిగి మూల విమానాశ్రయానికి పంపబడింది.
భద్రతా సంస్థలు ఈమెయిల్ మూలాన్ని ట్రేస్ చేస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. ప్రయాణికుల భద్రత కోసం అన్ని చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
Read More: Read Today’s E-paper News in Telugu
