TELANGANA PATRIKA(jun 6) , RCB Stampede Case , బెంగళూరు: 2025 IPL ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ తమ తొలి టైటిల్ను గెలుచుకుంది. ఈ విజయాన్ని పురస్కరించుకుని బెంగళూరులోని పరేడ్ నిర్వహించాలని అభిమానులు కోరగా, అధికారికంగా నగర పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినా సరే, చిన్నస్వామి స్టేడియం జరిగిన ఓవర్సైజ్డ్ సెలబ్రేషన్లో పరిస్థితులు అదుపుతప్పాయి.

ఒకే చోటకి లక్షల మంది.. ప్రాణాలు పోయిన ఆనందం..
RCB Stampede Case , చిన్నస్వామి స్టేడియం సామర్థ్యం 35,000 మంది మాత్రమే అయినా, సుమారు మూడు లక్షల మంది అభిమానులు అక్కడికి చేరుకోవడంతో భారీగా తొక్కిసలాట జరిగింది. RCB ప్లేయర్స్ బయట నుంచే చూసేద్దాం అన్న ఉత్సాహంలో వచ్చిన వారు బారులు తీరారు.
ఇంతలో ఎంట్రీ గేట్ల వద్ద తొక్కిసలాట జరగడంతో కనీసం 11 మంది ప్రాణాలు కోల్పోయారు, అనేకమందికి గాయాలయ్యాయి. ఇది ఆర్సిబి గెలుపు సందర్భంగా జరిగిన ఆనందోత్సవంలో చీకటి ఛాయలు విస్తరించిన ఘట్టంగా మారింది.
పోలీసులపై విమర్శలు – నిర్లక్ష్యమే కారణమా?
ఈ సంఘటనపై ప్రజలు, సోషల్ మీడియాలో పోలీసు శాఖపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పరేడ్కు ముందే నిరాకరణ చెప్పినా సరైన విధంగా మానిటరింగ్ లేకపోవడం, భారీ జనం నియంత్రణలో విఫలమవడం ఈ విషాదానికి దారితీసిందని పేర్కొంటున్నారు.
అధికారికంగా పరేడ్ నిరాకరించినా – అభిమానుల ఉత్సాహాన్ని ముందుగానే అంచనా వేసి భద్రత ఏర్పాట్లు చేపట్టాల్సిందని నిపుణులు సూచిస్తున్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu