
TELANGANA PATRIKA (JUN 8) , నిర్మల్ జిల్లా బోథ్ మండలంలోని ప్రసిద్ధి చెందిన పొచ్చెర జలపాతంలో గురువారం విషాదం చోటు చేసుకుంది. తేజపూర్ గ్రామానికి చెందిన నర్సరెడ్డి అనే వ్యక్తి జలపాతంలో దూకి ఆత్మహ*త్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, గజఈతగాళ్ల సహాయంతో మృ*తదేహాన్ని వెలికి తీశారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆవేదనకు గురిచేసింది. గతంలోనూ పలుమార్లు ఇక్కడ ఇలాంటి దుర్ఘటనలు జరగడం స్థానికులను కలచివేస్తోంది. ఆత్మహ*త్యలు, ప్రమాదాలు తరచుగా జరుగుతున్నప్పటికీ, ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పర్యాటకుల రాక ఎక్కువగా ఉండే ఈ జలపాత ప్రాంతంలో ప్రమాదకర ప్రాంతాలకు కంచె ఏర్పాటు చేయాలని, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఫారెస్ట్ మరియు టూరిజం శాఖలు చర్యలు తీసుకోవాలని, ఇదే చివరి సంఘటనగా మిగలాలని స్థానికులు కోరుతున్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu