operation sindoor success: ఆపరేషన్ సింధూర్ విజయాన్ని శ్లాఘిస్తూ ఇచ్చోడ లో తిరంగా యాత్ర!

operation sindoor success

operation sindoor success దేశ రక్షాణ ప్రతి భారతీయుని బాధ్యత… ఎంపిపి గోడం నగేష్, బోథ్ నియోజకవర్గం లోని ఇచ్చోడ మండల కేంద్రంలో…బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ కదం బాబా రావు పటేల్ ఆధ్వర్యంలో….ఆపరేషన్ సిందూర్ కు మద్దతుగా… తిరంగా ర్యాలీ నిర్వహించారు..మండల కేంద్రంలో స్థానిక హనుమాన్ సాయి ఆలయం నుండి అంబేద్కర్ చౌక్ వరకు నినాదాలు చేస్తూ పలు వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు… ఈ సందర్భంగా…ఎంపీ గొడం నగేష్ మాట్లాడుతూ…మన అఖండ భారతావని పై దుచర్యకు పాల్పడిన పాకిస్థాన్ కు భారత ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో… 3 రోజులలోనే కాళ్ళ బేరానికి వచ్చేలా చేయడం జరిగింది.. ఎల్లవేళలా దేశం పై దృష్టి పెట్టే తీవ్రవాదులను అరికట్టే భాధ్యత ప్రతి భారతీయుని పై ఉందని ఈ సందర్భంగా అన్నారు…ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు పతంగి బ్రహ్మానంద్, ఉపాధ్యక్షులు గుమ్మడి భీమ్ రెడ్డి, మాధవరావు ఆమ్టే, బిజెపి రాష్ట్ర నాయకుడు ముస్తాపూరి అశోక్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆడే మానాజి,జిల్లా కార్యదర్శి కొల్లూరు చంద్రశేఖర్,బీజేపీ జిల్లా మహిళా నాయకులు,వివిధ మండలాల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

operation sindoor success latest news telanganapatrika

ఇంకా ఇలాంటి విశ్లేషణాత్మక వార్తల కోసం www.telanganapatrika.in ను రోజు సందర్శించండి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *