Telanganapatrika (July 22): ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మంగళవారం హైదరాబాదులోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చొప్పదండి నియోజకవర్గం లోని పెండింగ్ లో ఉన్న పలు అభివృద్ధి పనులకు సంబంధించిన విషయాలను గురించి ముఖ్యమంత్రితో ఎమ్మెల్యే చర్చించారు.

అభివృద్ధి నిధులు గురించి ఎమ్మెల్యే చర్చ ..
ఉత్తర తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం అభివృద్ధికి నిధులు కేటాయించాలని అలాగే నారాయణపూర్ ప్రాజెక్టును పూర్తి చేయడానికి నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు.
చొప్పదండి నియోజకవర్గం లోని పెండింగ్ లో ఉన్న పలు అభివృద్ధి పనులకు సైతం నిధులు కేటాయించి సహకరించాలని ముఖ్యమంత్రి నీ కోరారు. చొప్పదండి నియోజకవర్గం అభివృద్ధికి నిధులు కేటాయించి సహకరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే సత్యంకు హామీ ఇచ్చారు. నియోజకవర్గం అభివృద్ధికి నిధులు కేటాయించడానికి అనుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
Read More: Read Today’s E-paper News in Telugu
