
TELANGANA PATRIKA(MAY27) , KARIMNAGAR CP Gaush Alam , కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఐపీఎస్ సోమవారం సాయంత్రం వీణవంక పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్లోని కార్యకలాపాలను పర్యవేక్షించి, పోలీస్ అధికారులతో సమావేశమయ్యారు. ప్రజల భద్రత కోసం తీసుకుంటున్న చర్యలపై సమీక్ష నిర్వహించారు.
KARIMNAGAR CP Gaush Alam శాంతిభద్రతల పరిరక్షణపై ఆదేశాలు..
సీపీ గౌస్ ఆలం రద్దీ ప్రాంతాల్లో నిఘా పటిష్టం చేయాలని, నేరాల నియంత్రణకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించి, వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు.
పర్యటనలో పాల్గొన్న అధికారులు:
ఈ పర్యటనలో జమ్మికుంట రూరల్ సీఐ కిషోర్, స్థానిక ఎస్సై తోట తిరుపతి, ట్రైనీ ఎస్సై సాయిక్రిష్ణ ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu