తెలంగాణ పత్రిక (APR.11) : Jagtial Collectorate. జగిత్యాల కలెక్టరేట్లోని ట్రెజరీ కార్యాలయం శుక్రవారం ఉదయం ఒక్కసారిగా హాట్స్పాట్గా మారింది. ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించగా, కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ రఘు కుమార్ రూ.7,500 లంచం తీసుకుంటూ అప్పుడే పట్టుబడ్డాడు.


వివరాల్లోకి వెళితే, సిబిఎస్ డబ్బుల విడుదల కోసం బాధితుడి వద్ద రూ.7,000 లంచం డిమాండ్ చేసినట్టు ఆరోపణలున్నాయి. డబ్బులు ఖాతాలో పడినప్పటికీ, మరోసారి కాల్ చేసి లంచం ఇవ్వాలని రఘు కుమార్ ఒత్తిడి చేయడంతో, బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
అనుకున్నట్లు వలపన్ని ఏసీబీ అధికారులు రంగంలోకి దిగినప్పుడు, సూటిగా లంచం తీసుకుంటున్న సందర్భంలో రఘు కుమార్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఏసీబీ త్వరలో మీడియాకు వెల్లడించనుంది.
Read More: IPS Sharath Chandra Pawar: జిల్లా వ్యాప్తంగా 30-30(ఎ) పోలీసు యాక్ట్-1861 అమలు ఎస్పి శరత్ చంద్ర పవార్