Telanganapatrika (August 04): IND VS ENG 5TH TEST , భారత్ మరియు ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదవ టెస్ట్ మ్యాచ్ ఈ రోజు ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ స్కోర్ 339 పరుగులకు 6 వికెట్ల నష్టానికి ఉంది.

IND VS ENG 5TH TEST ఫైనల్ ఫైట్..!
విజయానికి ఆ జట్టుకు ఇంకా 35 పరుగులు అవసరం కాగా, భారత్ గెలవాలంటే మరో 4 వికెట్లు తీసుకోవాల్సి ఉంది. క్రీజులో ఉన్న స్మిత్, ఓవర్టన్ వంటి ఆటగాళ్లు రన్స్ చేయగల సామర్థ్యం ఉన్నవారే.
తర్వాతి ఆటగాడు అట్కిన్సన్ కూడా కీలకంగా మారవచ్చు. ఈ పరిస్థితుల్లో భారత బౌలర్లు ఏదైనా అద్భుతం చేయగలిగితేనే విజయంపై ఆశ పెట్టుకోవచ్చు. లేకపోతే ఇంగ్లాండ్ 3-1 తేడాతో సిరీస్ను సొంతం చేసుకునే అవకాశం ఉంది.
Read More: Read Today’s E-paper News in Telugu