CM Revanth: భద్రాచలంలో సీతారాము ల కళ్యాణ మహోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి ఆయన సతీమణి గీతతో కలిసి హాజరయ్యారు. స్వామి వారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం లో అభిజిత్ సుముహుర్తమున శ్రీ సీతారాముల కళ్యాణోత్స వం అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. అశేష భక్త జనులతో మిథిలా స్టేడియం రామనామ స్మరణతో మారుమోగుతోంది.


ఇక తిరుమల తిరుపతి దేవస్థానం తరుఫున చైర్మన్ బీఆర్ నాయుడు భద్రాద్రి రాముడికి పట్టు వస్త్రాలను సమర్పించారు.ఈకళ్యాణోత్సవానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దంపతులు, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి,దంపతులు, సీఎస్ శాంతికుమారి,దంపతులు హాజరయ్యారు. అంతకు ముందు శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సరేఖ సీఎస్ శాంతికుమారి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్వి శైలజా రామ య్యార్ పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు.
Read More: fake Ai videos కంచి గచ్చిబౌలి భూముల ఫేక్ వీడియోలపై సర్కార్ సీరియస్
One Comment on “CM Revanth: రంగ రంగ వైభవంగా రాములోరి కళ్యాణం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి దంపతులు.”