Bengaluru Stampede: RCB ఐపీఎల్ టైటిల్ గెలవడంతో బెంగళూరులో అభిమానులు సంబరాల్లో పాల్గొనగా, ఒక స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది దేశ క్రీడా చరిత్రలో మరొక విషాద సంఘటనగా నిలిచింది. అభిమానుల అతి ఉత్సాహం, భద్రతా లోపాలే దీనికి కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఈ ఘటన 1980లో కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో జరిగిన ఫుట్బాల్ మ్యాచ్ దుర్ఘటనను గుర్తుకు తెస్తోంది. అప్పట్లో జట్ల మధ్య గొడవలతో 16 మంది మరణించగా, 1969లో అదే స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా టెస్టు టికెట్ల కోసం తొక్కిసలాట జరిగింది. ఇవన్నీ అభిమానుల అవగాహన లోపాన్ని సూచిస్తున్నాయి.
ఆరాధ్యుల కోసం ప్రాణాలు కోల్పోవడం కంటే బాధాకరం మరొకటి ఉండదు. సెలబ్రిటీలు జీవితాన్ని ఆస్వాదిస్తుంటే, తమకున్న ఆ ప్రేమను అర్థవంతంగా మార్చుకోవాలి కానీ అనవసరంగా ప్రాణాల మీదకు తెచ్చుకోవడం దుర్మార్గం. ప్రతి ఒక్కరు భద్రతా జాగ్రత్తలు పాటించాలి, ప్రభుత్వాలు సకాలంలో చర్యలు తీసుకోవాలి.
Read More: Read Today’s E-paper News in Telugu