Bengaluru Police: బెంగళూరులో జరిగిన తొక్కిసలాట ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. 11 మంది చనిపోవడంతో ఈ విషాద ఘటనపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానుల ఉత్సాహం నియంత్రణకు నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

కొంతమంది నెటిజన్లు, గతంలో పుష్ప-2 ట్రైలర్ విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనను గుర్తు చేస్తున్నారు. అప్పట్లో అల్లు అర్జున్ను బాధ్యుడిగా చేసి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారంటూ ఇప్పుడు RCB గెలుపు తర్వాత జరిగిన ఘటనలో 11 మంది చనిపోతే మాత్రం ఎవరినీ అరెస్టు చేయడం లేదని విమర్శిస్తున్నారు.
ఈ దుర్ఘటనకు ఎవరు బాధ్యత వహించాలి? రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? అన్న ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా మారుమోగుతున్నాయి. సెలబ్రిటీలు, క్రికెట్, సినిమా పేరిట జరుగుతున్న ఈ విషాద ఘటనలను ఇకనైనా ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలనే డిమాండ్ జోరుగా ఉంది.
Read More: Read Today’s E-paper News in Telugu