Jio Prime Membership: టెలికాం కంపెనీ Reliance Jio భారత్లో తన Jio Prime Membershipను మళ్లీ ప్రారంభించింది. కంపెనీ 10వ వార్షికోత్సవానికి ముందు తీసుకొచ్చిన ఈ కొత్త మెంబర్షిప్ ధర రూ.300. అయితే గతంలో ఉన్న రూ.99 Jio Primeతో పోలిస్తే ఈసారి ప్రయోజనాలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి.

Jio Prime Membership రూ.300 తో ఏం లాభం?
కొత్త Jio Prime సభ్యత్వం తీసుకున్న వారికి ప్రధానంగా ధరల పెంపు నుంచి రక్షణ లభించనుంది.
Jio ప్రకారం, సభ్యులు తమ ప్రస్తుత ప్లాన్పై సెప్టెంబర్ 5, 2027 వరకు టారిఫ్ పెంపును ఎదుర్కోరు. ఈ సమయంలో Jio రీఛార్జ్ ధరలు పెంచినా, Prime సభ్యుల ప్రస్తుత ప్లాన్కు ఈ ధర రక్షణ వర్తిస్తుంది.
Jio Prime ముఖ్య ప్రయోజనాలు
- మెంబర్షిప్ ధర: రూ.300
- ధర రక్షణ: సెప్టెంబర్ 5, 2027 వరకు
- కొత్త Jio SIMను స్నేహితుడు లేదా కుటుంబ సభ్యుడు తీసుకుంటే రూ.300 క్యాష్బ్యాక్
- ప్రాధాన్యతతో కస్టమర్ సపోర్ట్
- కొత్త Jio సేవలు, ఉత్పత్తులకు ముందస్తు యాక్సెస్
- ప్రత్యేక ట్రయల్స్, మెంబర్-ఓన్లీ ఆఫర్లు
ఎవరు Jio Prime తీసుకోవచ్చు?
కొత్త, ఇప్పటికే ఉన్న Jio కస్టమర్లు ఇద్దరూ రూ.300కి Prime Membership తీసుకోవచ్చు.
MyJio యాప్, Jio వెబ్సైట్, Jio స్టోర్లు, భాగస్వామ్య రిటైల్ అవుట్లెట్ల ద్వారా సభ్యత్వం పొందే అవకాశం ఉంది.
రూ.299 Jio ప్లాన్ కొనసాగుతుంది
Jio తన రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్ను కొనసాగిస్తున్నట్లు తెలిపింది.
Jio Prime Membership ఈ ప్లాన్లో:
- రోజుకు 1.5GB డేటా
- అపరిమిత వాయిస్ కాల్స్
- రోజుకు 100 SMS
- 28 రోజుల వ్యాలిడిటీ
- JioHotstar
- Google Gemini Pro సబ్స్క్రిప్షన్
- 5TB స్టోరేజ్
అందుబాటులో ఉంటాయి.
రూ.239 ప్లాన్ కూడా కొనసాగింపు
Jioలో ప్రస్తుతం తక్కువ ధరలో లభించే ప్లాన్ రూ.239. ఇందులో కూడా ఇదే తరహా ప్రయోజనాలు ఉన్నప్పటికీ వ్యాలిడిటీ 23 రోజులు మాత్రమే.
టారిఫ్ పెంపు సమయంలో Jio Prime ఎందుకు కీలకం?
దేశంలోని టెలికాం కంపెనీలు రీఛార్జ్ ధరలను పెంచే అవకాశం ఉందనే చర్చ జరుగుతున్న సమయంలో Jio Primeను తిరిగి తీసుకురావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Airtel, Vi, Jio వంటి కంపెనీలు రాబోయే నెలల్లో టారిఫ్లను సమీక్షించే అవకాశం ఉందని, ధరలు 15 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి.
ఇలాంటి సమయంలో రూ.300 Jio Prime తీసుకుంటే ప్రస్తుత టారిఫ్ను కొంతకాలం కొనసాగించుకునే అవకాశం Jio కస్టమర్లకు లభించనుంది.
Read More: Read Today’s E-paper News in Telugu

