Work From Home Cyber Fraud : మధ్యప్రదేశ్‌ నుంచి ఇద్దరు అరెస్ట్‌ నెలకు 900 మందిని లక్ష్యం చేస్తూ మోసం..!

TELANGANAPATRIKA (June 10):Work From Home Cyber Fraud. ఆదిలాబాద్ జిల్లా పోలీసులు మధ్యప్రదేశ్‌లోని తికమ్‌గఢ్ జిల్లా నుంచి ఇద్దరు సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. “ఇంట్లో పని – రోజుకు ₹8,000 సంపాదన” అనే వాఖ్యాలతో అమాయకులను మోసం చేస్తున్న ఈ ఘరానా ముఠా లక్షల్లో ప్రజలను దోచుకుంటోంది.

Join WhatsApp Group Join Now

Work From Home Cyber Fraud సైబర్ మోసం కథనం:

  • ప్రతినెల 900 మందిని టార్గెట్ చేస్తూ,
  • టెలిగ్రామ్, వాట్సాప్ ద్వారా బురిడీ కొట్టిస్తున్నారు.
  • బాధితులకు మొదట కొంత డబ్బు పంపించి నమ్మించి,
  • తరువాత ₹5.03 లక్షలు లాంటి భారీ మొత్తాలు వసూలు చేస్తున్నారు.
అరెస్టైన నిందితులు
  • సౌరభ్ రాయక్వార్ (24) – డిజిటల్ మార్కెటింగ్ పేరుతో వ్యాపారం
  • రితిక్ సేన్ (19) – వర్క్ ఫ్రం హోం పేరుతో స్కామ్

Work From Home Cyber Fraud మోసానికి ఉపయోగించిన పద్ధతి:

  1. “Hi, నా పేరు టీనా” అనే పేరుతో WhatsApp లో పరిచయం.
  2. “Work from home” అని చెప్పి తక్కువ సమయంతో ఎక్కువ డబ్బు సంపాదనను ఆశ చూపడం.
  3. మొదటి Task కు ₹150-₹450 చెల్లించి బాధితుడిని వలలో వేయడం.
  4. Task లు పూర్తయ్యాక “పే చేయాలంటే డిపాజిట్ చేయాలి” అని చెప్పి డబ్బు తీసుకోవడం.
  5. మొత్తంగా ఒక్క చెన్న శివకుమార్ అనే బాధితుడి నుంచి ₹5,03,000 వసూలు చేశారు.

పోలీసుల చర్యలు:
ఆదిలాబాద్ జిల్లా SP అఖిల్ మహాజన్ IPS ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటైంది.

మధ్యప్రదేశ్‌లో ముఠా సభ్యుల్ని ట్రేస్ చేసి అరెస్టు చేశారు.

స్వాధీనం చేసుకున్న వస్తువులు:

  • 4 మొబైల్ ఫోన్లు
  • 1 ల్యాప్‌టాప్
  • 3 బ్యాంక్ పాస్‌బుక్స్
  • కీబోర్డ్, మానిటర్
  • పాన్ కార్డు

బాధితుడి వివరాలు:

  • పేరు: చెన్న శివకుమార్
  • వయస్సు: 34
  • వృత్తి: ప్రైవేట్ ఉద్యోగి
  • నివాసం: జాందాపూర్ గ్రామం, ఆదిలాబాద్ రూరల్ మండలం

జనాలను హెచ్చరిస్తున్న పోలీసులు
మీరు సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 కి కాల్ చేయండి.

  • గోల్డెన్ అవర్ (1 గంట లోపు) సమాచారం డబ్బు తిరిగి రాబట్టే అవకాశం ఎక్కువ.
  • Work From Home లేదా Easy Money పేరుతో వచ్చే WhatsApp/Telegram లింకులు నుండి దూరంగా ఉండండి.
  • తెలియని వ్యక్తుల లింకులు, Apps ని మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేయవద్దు.

SP అఖిల్ మహాజన్ ఐపీఎస్ హెచ్చరిక
“నేటి యుగంలో ఇంటర్నెట్ వేదికగా నేరాలు విస్తరిస్తున్నాయి. అమాయక ప్రజలు మోసపోవడం నివారించాలంటే అవగాహన అవసరం. ముందుగా అప్రమత్తంగా ఉండాలి.”

Read More: Read Today’s E-paper News in Telugu

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *