TELANGANA PATRIKA(JUN 6) , Telangana Cabinet , తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సెక్రటేరియట్లో జరిగిన మీడియా సమావేశంలో ఈ విషయాలను వెల్లడించారు. ఉద్యోగుల సంక్షేమం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతగా ఉందని ఆయన స్పష్టం చేశారు.

Telangana Cabinet ప్రధానంగా తీసుకున్న నిర్ణయాలు
- రెండు డీఏలు
- ఒక డీఏను వెంటనే అమలు చేస్తారు
- మరో డీఏను ఆరు నెలల తర్వాత అమలు చేయనున్నారు
Telangana Cabinet హెల్త్ కార్డులకు నూతన ట్రస్ట్
- ఉద్యోగులు ప్రతినెలా ₹500 చొప్పున జమ చేస్తారు
- అదే మొత్తాన్ని ప్రభుత్వం కూడా జమ చేస్తుంది
- చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ట్రస్ట్ ఏర్పాటవుతుంది
ఉద్యోగుల పెండింగ్ బిల్లు చెల్లింపులపై Telangana Cabinet నిర్ణయం
- ప్రతినెలా కనీసం ₹700 కోట్లు బిల్లులకు మంజూరు చేయాలనే నిర్ణయం
- 12.5% సెక్రటేరియట్ కోటాకు ఆమోదం
- మెడికల్ ఇన్వాలిడేషన్ కమిటీ ఏర్పాటుకు సానుకూలత
- రిటైర్ అయిన ఉద్యోగుల సేవలను వినియోగించకూడదన్న నిర్ణయం
- గ్రామ పంచాయతీ ఉద్యోగులకు గ్రేడింగ్ ఆధారంగా ప్రమోషన్స్
- ఎన్నికల సమయంలో బదిలీపై వచ్చిన అధికారుల రీకాల్
- నర్సింగ్ డైరెక్టర్ పోస్టు ఏర్పాటుకు ఆమోదం
- అంగన్వాడీల రిటైర్మెంట్ బెనిఫిట్లు ₹2 లక్షలకి పెంపు
- GO 317 పై సమీక్ష
- అద్దె వాహనాల పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడం & వాహనాల హద్దుల పెంపు
DY.CM భట్టి విక్రమార్క వ్యాఖ్యలు..
“ఉద్యోగులను మా కుటుంబ సభ్యుల్లా చూస్తున్నాం. వారి సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. పథకాలను ప్రజల వరకూ తీసుకెళ్లే ఉద్యోగుల పాత్ర కీలకం.”

అలాగే, ఉద్యోగ సంఘాల డిమాండ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడుగురు ఉన్నతాధికారులతో కమిటీని నియమించారని తెలిపారు. ఉద్యోగుల సమస్యలపై ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీకి తనే చైర్మన్ అని వెల్లడించారు.
“ఉద్యోగుల డిమాండ్లను పెద్ద మనసుతో అర్థం చేసుకొని ఆమోదించిన సీఎం రేవంత్ రెడ్డికి, క్యాబినెట్ సహచరులకు హృదయపూర్వక ధన్యవాదాలు,” అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu