
TELANGANA PATRIKA(MAY29) , ప్రపంచవ్యాప్తంగా టెక్ పరిశ్రమలో Layoffs చోటుచేసుకుంటున్న ఉద్యోగ కోతలు భారత సాఫ్ట్వేర్ ఉద్యోగులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఐబీఎం వంటి టెక్ దిగ్గజాలు 70,000 మందికిపైగా ఉద్యోగాలను తొలగించగా, భారత స్టార్టప్లు కూడా 3,500 మందికి పైగా లేఆఫ్లు ప్రకటించాయి.
Layoffs ఎందుకు జరుగుతున్నాయ్ ఈ ఉద్యోగ కోతలు..?
కంపెనీల రెవెన్యూ ఆశించిన స్థాయికి చేరకపోవడం, ఆర్థిక వ్యవస్థలో అస్థిరత, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకం పెరగడం వంటి కారణాల వల్ల ఎన్నో సంస్థలు తమ ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి.
కొన్ని కంపెనీలు “cost-cutting strategy” పేరిట అనుభవజ్ఞులైన ఉద్యోగులను తొలగించడం ప్రారంభించాయి. దీంతో సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగ భద్రతపై భయం పెరిగిపోతోంది.
Layoffs ఉద్యోగుల భవితవ్యం ఏమిటి?
ఎంతో మంది IT ఉద్యోగులు ప్రస్తుతం అనిశ్చితి, ఆందోళన, మరియు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. కొంతమంది వేరే దేశాలకు వెళ్ళే మార్గాలు వెతుకుతున్నప్పటికీ, మరికొందరు ఫ్రీలాన్సింగ్, స్టార్టప్లు ప్రారంభించడం, లేదా కోర్సులు చేసి నూతన స్కిల్స్ నేర్చుకోవడం వైపు మొగ్గుచూపుతున్నారు.
ఈ పరిణామాలు తాత్కాలికమేనా లేక దీర్ఘకాలిక మార్పుకి సంకేతమా అన్నదానిపై వర్గవర్గాలుగా వాదనలు కొనసాగుతున్నాయి.
Read More: Read Today’s E-paper News in Telugu