SP Akhil Mahajan: రౌడీయిజానికి అష్టదిగ్బంధనం – ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తేల్చిచెప్పారు 2025

తెలంగాణ పత్రిక (APR.25) : SP Akhil Mahajan. ఆదిలాబాద్ సబ్ డివిజన్ పరిధిలో రౌడీషీట్లు ఉన్న వారితో వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ, “రౌడీయిజానికి ఇకనుంచి జీరో టాలరెన్స్. ఎవరు నేరచర్యలకు పాల్పడినా వారిపై చట్టపరమైన చర్యలతోపాటు అష్టదిగ్బంధనం చేస్తాం,” అని హెచ్చరించారు.

Join WhatsApp Group Join Now

SP Akhil Mahajan

రౌడీయిజానికి రెడ్ కార్డు

రౌడీయిజం, బెదిరింపులు, గంజా*యి, మట్కా, హత్యాయత్నాలు, కోట్లు వంటి నేరాలపై ప్రత్యేక నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. ‘‘ఇలా మరోసారి దందాలకు పాల్పడితే పిడి యాక్ట్ కూడా ప్రయోగిస్తాం’’ అన్నారు.

మంచి ప్రవర్తనకు ప్రోత్సాహం

సత్ప్రవర్తన కనబరిచిన వారికి రౌడీషీట్లు తొలగిస్తామని తెలిపారు. “బాధితులకు న్యాయం చేయడమే మా లక్ష్యం,” అని ఎస్పీ పేర్కొన్నారు.

శాంతియుత వాతావరణం కోసం

“ఆదిలాబాద్ జిల్లాలో ప్రజలకు భద్రతా వాతావరణం కల్పించేందుకు కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలు చట్టాన్ని నమ్మాలి, నేరాలకు దూరంగా ఉండాలి,” అని అఖిల్ మహాజన్ పిలుపునిచ్చారు.

గమనిక: రౌడీయిజానికి పాల్పడే వారికి ఇక చట్టం చెరువు తప్పదు. జిల్లా ఎస్పీ స్పష్టం చేసిన విధంగా, మంచి ప్రవర్తనకు మాత్రమే అవకాశముంది.

Read also: TG intermediate 2025: ఇంటర్లో ఫెయిల్ అయినా విద్యార్థిని ఆహ*త్య

About Ganeshghani

GaneshGhani is a Editor with 1.5 years of experience in writing news articles on topics like education, jobs, and politics, clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest, making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →