Siddaramaiah Rajya Sabha Offer: కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజ్యసభ సీటు ఆఫర్ను తిరస్కరించినట్లు ప్రకటించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం బెంగళూరులోని తన నివాస కార్యాలయం “కృష్ణ”లో నిర్వహించిన మీడియా సమావేశంలో సిద్ధరామయ్య ఈ విషయాన్ని వెల్లడించారు.
కాంగ్రెస్ అధిష్టానం నన్ను రాజ్యసభకు వెళ్లమని కోరింది. కానీ నేను వినయంగా ఆ ఆఫర్ను తిరస్కరించాను. నాకు జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదు, అని స్పష్టం చేశారు.
Siddaramaiah Rajya Sabha Offer రాష్ట్ర రాజకీయాల్లోనే కొనసాగింపు
తాను రాష్ట్ర రాజకీయాల్లోనే కొనసాగుతానని, ప్రజల మధ్యే ఉంటానని సిద్ధరామయ్య తెలిపారు. వరుణ నియోజకవర్గ ప్రజలు తనను ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారని, ఇంకా రెండేళ్ల పదవీకాలం మిగిలి ఉందని గుర్తుచేశారు.
“ఆ రెండేళ్ల పాటు కర్ణాటక ప్రజల కోసం, నా నియోజకవర్గ ప్రజల కోసం పనిచేస్తాను” అని చెప్పారు.
Siddaramaiah on politics రాజకీయ పోరాటం కొనసాగిస్తా
భవిష్యత్ రాజకీయ ప్రణాళికలపై ప్రశ్నించగా సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఇకపై కూడా క్రియాశీల రాజకీయాల్లో ఉంటానని, సామాజిక విభజన శక్తులపై పోరాటం కొనసాగిస్తానని తెలిపారు.
రాజీనామాపై వివరణ
తన రాజీనామా వెనుక అసలు కారణం ఏమిటన్న ప్రశ్నకు స్పందిస్తూ.. “అధిష్టానం ఎప్పుడైతే చెప్పుతుందో అప్పుడు రాజీనామా చేస్తానని మొదటి నుంచే చెబుతున్నాను” అన్నారు.
పార్టీ అధిష్టానం నుంచి ఒత్తిడి వచ్చిందా అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. “ఏ ఒత్తిడి లేదు. వారు అడిగిన వెంటనే నేను స్వచ్ఛందంగా రాజీనామా చేశాను” అని చెప్పారు.
సిద్ధరామయ్య చేసిన ఈ వ్యాఖ్యలు కర్ణాటక కాంగ్రెస్లో కొత్త రాజకీయ సమీకరణాలకు సంకేతాలుగా భావిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఆయన పాత్ర ఇంకా కీలకంగానే కొనసాగనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Read More: Read Today’s E-paper News in Telugu

