TELANGANAPATRIKA (June 18): SBI Accident Insurance Claim .కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని ఎస్బిఐ బ్రాంచ్ లో ఓ కుటుంబానికి భారీ బీమా సాయం అందింది. SBI Accident Insurance Claim ప్రణాళిక కింద, రిజినల్ మేనేజర్ శ్రీ ఎస్. వెంకటేశ్ గారు రూ. 20 లక్షల చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు.

కురిక్యాల గ్రామానికి చెందిన ఒగ్గూరి ప్రశాంత్, 01-04-2025 న కరెంట్ షాక్ వల్ల మర*ణించారు. వారు ఎస్.బి.ఐ జనరల్ ఇన్సూరెన్స్లో అప్రమత్తతగా 1000 రూపాయల ప్రీమియంతో బీమా తీసుకున్నారు. వారి కుటుంబ సభ్యులు బ్యాంకును సంప్రదించగా, మేనేజర్ నుండి పూర్తి సమాచారం, క్లెయిమ్ దాఖలు సహాయం లభించింది.
SBI Accident Insurance Claim బాధితుల కుటుంబానికి మద్దతుగా ఎస్.బి.ఐ
మంగళవారం జరిగిన కార్యక్రమంలో, మృ*తుడి భార్య ఉమ చేతికి రూ. 20 లక్షల చెక్కును రీజినల్ మేనేజర్ శ్రీ వెంకటేశ్, బ్రాంచ్ మేనేజర్ వంశీధర్, CM డీవీఎస్ ప్రసాద్ కోసరి, ఎస్బిఐ జనరల్ ఏరియా మేనేజర్ కిరణ్ రెడ్డి, BDM రాజు, మాజీ సర్పంచ్ మేచినేని నవీన్ రావు కలిసి అందించారు.
ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ, “ఇలాంటి ప్రమాదాలపైనా జాగ్రత్తగా బీమా పొలిసీలు తీసుకోవాలి. మహిళా సంఘాలు, గ్రామీణ ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి” అని తెలిపారు.
Read More: Read Today’s E-paper News in Telugu