Telangana patrika (June11 ) Sarangapur Latest News, ఈరోజు ఐసిడిఎస్ ధర్మపురి ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఐసిడిఎస్ ధర్మపురి ఆధ్వర్యంలో సారంగాపూర్ మండలంలోని లక్ష్మీదేవి పల్లి 3 అంగన్వాడి సెంటర్ లో అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమము నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రీస్కూల్ కు సంబంధించినటువంటి మెటీరియల్ అంతా డిస్ప్లే చేసి తల్లులకు ప్రీ స్కూలు యొక్క ప్రాముఖ్యతను గురించి అంగన్వాడీ సూపర్వైజర్ లత వివరించడం జరిగింది పిల్లలు రెండున్నర సంవత్సరాల నుండి ఐదు సంవత్సరాల పిల్లలకు ప్రీస్కూల్ విద్య వారికి ఎంతో ఉపయోగపడుతుందని అన్ని అభివృద్ధి క్షేత్రాలను పిల్లలు చేరుకోగలుగుతారని తల్లులకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తల్లులు పిల్లలు మరియు అంగన్వాడీ టీచర్స్ ఆదిలక్ష్మి రాజకుమారి శ్యామల స్వప్న పాల్గొనడం జరిగింది.
