TELANGANAPATRIKA (June 25): Rythu Bharosa Scheme Telangana. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా పథకంకు రైతులు గట్టి మద్దతు తెలిపారు. మల్యాల మండల కేంద్రంలో రైతన్నలు, నాయకులు ఘనంగా విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. 9 రోజుల్లో 9 కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ కావడం పట్ల మండల రైతులు సంతోషం వ్యక్తం చేశారు.

Rythu Bharosa Scheme Telangana పాలభిషేకం & టపాసులతో రైతుల సంబరాలు
ఈ విజయాన్ని పురస్కరించుకొని, మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మల్యాల అంగడి బజార్ లో సీఎం రేవంత్ రెడ్డి మరియు స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చిత్రపటాలకు పాలభిషేకం చేశారు. అనంతరం టపాసులు పేల్చి రైతులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
రైతులకు అండగా నిలుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ –
“ఎన్ని కష్టాలున్నా, అన్నదాతల అడ్డుగా నిలుస్తున్నది రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం” అని పేర్కొన్నారు.
Raythu Bharosa Scheme Telangana పథకాలు హైలైట్:
- రెండు లక్షల రూపాయల రుణమాఫీ
- క్వింటా వరిబియ్యానికి ₹500 బోనస్
- ఉచిత కరెంట్
- రైతు భరోసా నిధుల అందచేత
కార్యక్రంలో పాల్గొన్న ముఖ్య నాయకులు
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు:
ఏఎంసి చైర్మన్ బత్తిని మల్లేశ్వరిశ్రీనివాస్ , వైస్ చైర్మన్ చిరంజీవి , యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ముత్యం శంకర్ గౌడ్ , పార్టీ అధ్యక్షుడు దొంగ ఆనందరెడ్డి , మాజీ ఎంపీపీ దారం ఆదిరెడ్డి , తక్కలపల్లి పిఎసిఎస్ చైర్మన్ తోట్ల చంద్రశేఖర్ , మరియు అనేక మంది రైతు నాయకులు, కార్యకర్తలు,
రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
Rythu Bharosa Scheme Telangana పథకం రైతులలో విశ్వాసం నింపుతూ సాగుతోంది. ఇది కేవలం ఒక సబ్సిడీ మాత్రమే కాదు, రైతుల పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనం. రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలతో అన్నదాతల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని నాయకులు పేర్కొన్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu