
TELANGANA PATRIKA(JUN 4) , Ration News Telangana , సంగారెడ్డి శాంతినగర్ ప్రాంతంలో రేషన్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద సర్వర్ సమస్యలతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూడు నెలల రేషన్ ఒకేసారి ఇవ్వడంతో ఉదయం 6 గంటలకే ప్రజలు షాపుల ఎదుట గాపులు కాస్తున్నారు. గంటల తరబడి లైన్లో నిలబడి బలహీనపడుతున్న వారు, కొన్ని చోట్ల చెప్పులు, సంచులు పెట్టి క్యూలో స్థానాలు ఆక్రమిస్తున్నారు.
Ration News Telangana సాంకేతిక లోపాలే ప్రధాన కారణం
ఒక్కరికి రేషన్ ఇవ్వడానికి సగటున 30 నుండి 45 నిమిషాల సమయం పడుతోందని లబ్ధిదారులు చెబుతున్నారు. గత మూడు రోజులుగా “సర్వర్ ప్రాబ్లం” అనే సమాధానంతో ప్రజలు నిరాశతో తిరుగుతున్నారు. తమ రోజువారీ కూలి పనులు వదిలి వచ్చినా, సరైన సమయానికి రేషన్ అందకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వాన్ని నిలదీస్తున్న ప్రజలు
“మూడు నెలల రేషన్ ఇవ్వేముందు సర్వర్ సమస్యల్ని పరిష్కరించలేరా?” అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సాయంత్రం వరకు పనులైపోయిన తరువాత కూడా వచ్చి లైన్లో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడిందని బాధితులు చెప్పారు. అధికారులు త్వరితగతిన స్పందించి, రేషన్ సరఫరా ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu