
TELANGANA PATRIKA(MAY 22) , అర్హులైన లబ్ధిదారులు అందించిన దరఖాస్తులను రాజీవ్ యువ వికాస పథకంకు ఎంపిక త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి అధికారులను ఆదేశించారు.
రాజీవ్ యువ వికాస పథకం ఎంపిక పై మాట్లాడుతూ..
గురువారం కలెక్టర్ కార్యాలయంలోని అదనపు కలెక్టర్ తన ఛాంబర్ లో రాజీవ్ యువ వికాస పథకానికి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక పై సంబంధిత అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ… ముందుగా ఏ యూనిట్ ఏ శాఖ పరిధిలోకి వస్తున్నది అన్నది నిర్ధారించుకోవాలన్నారు.ప్రభుత్వ నిబంధనల మేరకు యూనిట్ కాస్టును అంచనా వేయాలని ఆయా ప్రాంతంలోని డిమాండ్ కు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలన్నారు.మరికొన్ని యూనిట్ల స్థాపనకు ఆయా గ్రామాల గ్రామపంచాయతీ అనుమతులు పట్టణంలో అయితే మునిసిపాలిటీ అనుమతులు తప్పనిసరిగా పొందాలన్నారు.మత్స్య, పశుసంవర్ధక, వైద్య ఆరోగ్య, వ్యవసాయ, ఉద్యాన, డి ఆర్ డి ఏ, తదితర విభాగాల కింద వచ్చే ప్రతి యూనిటును క్షుణ్ణంగా సమీక్షించారు.అంతేకాకుండా ఉపాధిలో భాగంగా వివిధ రకాల వ్యాపారాలు, వాహనాల కొనుగోళ్లపై సమీక్షిస్తూ ఆయా కుటుంబాల స్థితిగతులను పరిగణలోకి తీసుకోవాలని ఇతరత్రా కార్యక్రమాల ద్వారా అవసరమైతే శిక్షణ కార్యక్రమాలు ఇప్పించాలని అధికారులకు సూచించారు.ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత వ్యవధి లోగా సాధించేందుకు అధికారులు అంకిత భావంతో పని చేయాలన్నారు.ఈ సమీక్ష సమావేశంలో జడ్పీసీఈఓ శోభారాణి డిఆర్డిఏ పిడి నాగిరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడి శ్యాంసుందర్, ఫిషరీస్ ఏడి రాజారామ్, పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ మోతిలాల్, బీసీ సంక్షేమ అధికారి యాదయ్య, వ్యవసాయ శాఖ అధికారి గోపాల్, ఉద్యాన శాఖ అధికారి సుభాషిని, వైద్యశాఖ అధికారి డాక్టర్ మనోహర్,పరిశ్రమల శాఖ ఏడి విజయకుమార్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.
Also Read : Rajiv Yuva Vikasa: లోన్ కావాలా….. సిబిల్ స్కోర్ తప్పనిసరి…!