Rajanna Sircilla 2025: సిరిసిల్లలో మంత్రుల పర్యటనకు పటిష్ట భద్రత – ఎస్పీ మహేష్ గితే

తెలంగాణ పత్రిక (APR.10) Rajanna Sircilla 2025. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రుల పర్యటన నేపథ్యంలో జిల్లా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. రేపు అనగా ఏప్రిల్ 11 శుక్రవారం రోజున సిరిసిల్ల పట్టణంలోని పెద్దూరు సమీపంలో ఉండె అపెరల్ పార్క్ ప్రాంగణంలో నిర్వహించే టెక్స్ పోర్ట్ యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం మంత్రులు జిల్లాకు రానున్నారు.

Join WhatsApp Group Join Now

Rajanna Sircilla 2025
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే (IPS) మీడియాతో మాట్లాడుతూ:
  • “మంత్రుల పర్యటన నేపథ్యంలో అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు పూర్తయ్యాయి. సిబ్బంది క్షేత్ర స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు దిశానిర్దేశం చేశాం” అని తెలిపారు.

జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎస్పీ, పర్యటనకు సంబంధించిన వాహనాల అనుమతులు, బందోబస్త్, ట్రాఫిక్ నియంత్రణ, ఇతర భద్రతా అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.పర్యటన సందర్భంగా శాంతి భద్రతల కోసం ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు.

తేదీ 11-04-2025 అనగ రేపు శుక్రవారం రోజున ఉదయం 11:30 నిమిషాలకు రాజన్న సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని అపెరల్ పార్క్ లో టెక్స్ పోర్ట్ యూనిట్ ను శుక్రవారం

  • రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు,
  • చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు
  • బిసి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రారంభించనున్నారు.
Rajanna Sircilla 2025
Rajanna Sircilla 2025

Read more: Read Today’s E-paper News in Telugu

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →

Comments are closed.