
TELANGANA PATRIKA(MAY29) , రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ లో భాగంగా, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం అర్సపల్లి, ఖానాపూర్, సారంగాపూర్ ప్రాంతాలలో ఉన్న ప్రధాన రైస్ మిల్లులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డీఎస్ఓ అరవింద్ రెడ్డి, సివిల్ సప్లైస్ డీ.ఎం శ్రీకాంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
తనిఖీలు జరిగిన మిల్లుల వివరాలు..
- అర్సపల్లిలో రుద్రా రైస్ మిల్లు
- ఖానాపూర్లో ఎల్.జీ ఆగ్రో ఇండస్ట్రీస్, వీరభద్ర రైస్ మిల్లు
- సారంగాపూర్లో అనూ ఫుడ్స్ రైస్ మిల్లు
ఈ మిల్లుల్లో ధాన్యం బస్తాల దిగుమతి, మిల్లింగ్ ప్రక్రియ, నిల్వల నిర్వహణ వంటి అంశాలను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు.
నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సూచనలు – వర్షాల ముందు పూర్తి మిల్లింగ్ చేయండి
ముందస్తుగా రుతుపవనాల ప్రభావంతో వర్షాలు పడుతున్న నేపథ్యంలో ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేయాలని,ధాన్యం తడవకుండా భద్రతగా నిల్వ పెట్టాలని,మిల్లింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని ధాన్యం నిల్వలు సక్రమంగా దిగుమతి కాకపోతే తడిచే ప్రమాదం ఉందని హెచ్చరించారు ఇప్పటికే 90% పైగా ధాన్యం సేకరణ పూర్తయిన నేపథ్యంలో మిగిలిన భాగాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.
పర్యవేక్షణ మరింత కఠినం ,కలెక్టర్ స్పష్టం చేసిన అంశాలు:
మిల్లుల వద్ద తరుగు తీస్తున్నారా అన్న దానిపై ప్రశ్నించారు,బియ్యం భద్రతగా నిల్వ చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు,అధికారులను నిర్లక్ష్యం లేకుండా పకడ్బందీ పర్యవేక్షణకు ఆదేశించారు
Read More: Read Today’s E-paper News in Telugu