Nepal Flash Floods: నేపాల్లో ఆగస్టు 26న సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా చిక్కుకుపోయిన మహారాష్ట్రకు చెందిన 404 మంది పర్యాటకుల్లో 338 మంది సురక్షితంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మరో 37 మంది టిబెట్లోని సాగర్ నుంచి భారత్కు తరలిస్తున్నారు.

Nepal Flash Floods 60 మంది పర్యాటకుల ఆచూకీ ఇంకా లేదు
మహారాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. మొత్తం 404 మందిలో 60 మంది పర్యాటకులతో ఇంకా అధికారులు నేరుగా సంప్రదించలేకపోయారు. వీరంతా ముంబైకి చెందిన రిచా టూర్స్ ద్వారా నేపాల్కు వెళ్లినట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు, విదేశాంగ మంత్రిత్వ శాఖ చైనా/టిబెట్ ప్రాంతంలో సురక్షితంగా ఉన్న 149 మంది భారతీయుల జాబితాను మహారాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. వీరు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందినవారు కావడంతో జిల్లా కలెక్టర్ల ద్వారా వివరాలను సేకరిస్తున్నారు.

Nepal Flash Floods 37 మంది భారత్కు తిరుగు ప్రయాణం
404 మంది మహారాష్ట్ర వాసుల్లో 37 మంది టిబెట్లోని సాగర్ ప్రాంతం నుంచి బయలుదేరి భారత్కు తరలిస్తున్నారు. నాగ్పూర్కు చెందిన 105 మంది ఇప్పటికే భారత్కు తిరిగి వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
అధికారులు మిగిలిన వారి వివరాలను కూడా నిర్ధారించే పనిలో ఉన్నారు. ఆన్లైన్ ద్వారా మరో ఆరుగురి సమాచారం అందినప్పటికీ, వారితో కూడా నేరుగా సంప్రదింపులు జరగలేదని నివేదిక పేర్కొంది.
రెస్క్యూ చర్యలు ముమ్మరం
స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ (SEOC) విదేశాంగ మంత్రిత్వ శాఖ కంట్రోల్ రూమ్తో సమన్వయం చేస్తోంది. అవసరమైన ప్రాంతాల్లో రెస్క్యూ బృందాలను మోహరించారు.
జిల్లా అధికారులు పర్యాటకుల కుటుంబ సభ్యులు, ట్రావెల్ ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతూ సమాచారం సేకరిస్తున్నారు. ఆచూకీ లేని 60 మందిని గుర్తించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
Nepal Flash Floods నేపాల్లో భారీ నష్టం
ఆగస్టు 26న నేపాల్లోని రసువా, మధ్య ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ వరదల కారణంగా ప్రాణనష్టం జరగడంతో పాటు ఇళ్లు, రహదారులు, వంతెనలు, జలవిద్యుత్ మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దాదాపు 2,000 మంది ఆచూకీ తెలియకుండా పోయినట్లు సమాచారం.
Read More: Read Today’s E-paper News in Telugu
