NEET UG 2025 cutoff ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. ఈసారి స్కోర్ లెవెల్స్పై విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి. ముఖ్యంగా MBBS కటాఫ్ గణనీయంగా తగ్గవచ్చని విద్యా నిపుణులు అంచనా వేస్తున్నారు.

NEET UG 2025 Cutoff
తాజా సమాచారం ప్రకారం, తెలంగాణలో 438 మార్కులతో ప్రభుత్వ మెడికల్ సీటు అందుకునే అవకాశం ఉన్నట్లు సూచనలు కనిపిస్తున్నాయి. ఇది గత సంవత్సర కటాఫ్తో పోలిస్తే తక్కువగా ఉంది. పలు రాష్ట్రాల్లో మెడికల్ సీట్ల సంఖ్య పెరగడం, పరిక్ష పద్ధతులలో మార్పులు ఇవి కారణాలు కావొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పుడుచెర్రీ, గోవా వంటి రాష్ట్రాల్లో 460–465 మార్కుల పరిధిలో అడ్మిషన్లు సాధ్యమవుతాయని అంచనా. అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో సుమారు 470 స్కోర్లతో ప్రభుత్వ సీటు సాధ్యం కావచ్చు. ఈ డేటా ఆధారంగా విద్యార్థులు తమ ఎంపికలను స్పష్టంగా చేసుకోవచ్చు.
ఒక్కసారి మాత్రం గుర్తుంచుకోవాల్సిందేమంటే – ఇది అంచనా మాత్రమే. అధికారిక కౌన్సెలింగ్ ప్రక్రియ తర్వాతే ఖచ్చితమైన కటాఫ్ లిస్టు బయటకు వస్తుంది.
📌 తాజా విద్యా వార్తల కోసం nta.ac.in లేదా తెలంగాణ ప్రభుత్వ ఆరోగ్య విద్యాశాఖ వెబ్సైట్ను సందర్శించండి
ఇంకా ఇలాంటి విశ్లేషణాత్మక వార్తల కోసం www.telanganapatrika.in ను రోజు సందర్శించండి!