Modi welcomes Putin in Delhi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను ఢిల్లీలో స్వాగతించారు. నాలుగు ఏళ్ల తర్వాత పుతిన్ భారత్కు రావడం విశేషం. ఈ 27 గంటల పర్యటనలో ఇద్దరు నేతలు 23వ ఇండియా–రష్యా సదస్సు నిర్వహించనున్నారు.

ఎయిర్పోర్ట్లో మోదీ స్వయంగా వెళ్లి పుతిన్ను ఆలింగనం చేసి స్వాగతించగా, సంప్రదాయ నృత్యాలతో కళాకారులు కూడా అతిథ్యాన్ని అందించారు. అక్కడి నుంచి ఇద్దరు కలిసి మోదీ నివాసానికి వెళ్లారు. తరువాత మోదీ ప్రత్యేక విందు ఇచ్చి పుతిన్కు ఆతిథ్యం ఇచ్చారు.
ఈసారి సదస్సులో ప్రధానంగా చర్చించనున్న అంశాలు:
రక్షణ ఒప్పందాలు
– S-400 మిసైల్ సిస్టమ్ల అదనపు కొనుగోలు
– Su-57 ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్ల కొనుగోలు అవకాశాలు
– రక్షణ సహకారాన్ని మరింత విస్తరించడం
వాణిజ్యం & క్రూడ్ ఆయిల్
ఇండియా భారీగా రష్యా నుండి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తుండడంతో పెరుగుతున్న ట్రేడ్ డెఫిసిట్ పై భారత్ ఆందోళన వ్యక్తం చేయనుంది. అమెరికా కొత్త టారిఫ్లు, రష్యా ఆయిల్ పై సాంక్షన్ల నేపథ్యంలో ఈ చర్చలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
రష్యా ఈసారి భారతికి అదనపు డిస్కౌంట్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉందని సమాచారం.
ఎనర్జీ & న్యూక్లియర్ సహకారం
స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్, ఎనర్జీ రంగంలో కొత్త భాగస్వామ్యాలు, రష్యా నుండి ఎరువుల దిగుమతుల పెంపు వంటి అంశాలు అజెండాలో ఉన్నాయి.
ఉక్రెయిన్ యుద్ధం పై చర్చలు
పుతిన్, ఉక్రెయిన్ పరిస్థితిపై తాజా సమాచారం మోదీతో పంచుకోనున్నారు. భారత్ మాత్రం తన పాత స్టాండ్ — “డైలాగ్ & డిప్లొమసీ ద్వారానే సమస్య పరిష్కారం” — ను కొనసాగిస్తోంది.
కార్మిక ఒప్పందాలు & వ్యాపార సహకారం
– రష్యాలో ఇండియన్ వర్కర్లకు అవకాశం కల్పించే కొత్త ఒప్పందం
– వ్యవసాయం, ఫార్మా, ఫుడ్ ప్రొడక్ట్స్ ఎగుమతుల పెంపు
– ఇండియా-EAEU ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పై చర్చ
శుక్రవారం పుతిన్కు రాష్ట్రపతి భవన్లో గార్డ్ ఆఫ్ ఆనర్, రాజ్ఘాట్లో మహాత్మా గాంధీకి నివాళి, తరువాత హైదరాబాద్ హౌస్లో ద్వైపాక్షిక చర్చలు ఉంటాయి. సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందు ఇస్తారు.
Modi welcomes Putin in Delhi
ఈ సందర్శనతో ఇండియా–రష్యా సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. రష్యా భారత్కు ఎన్నో దశాబ్దాలుగా “టైమ్–టెస్టెడ్ ఫ్రెండ్” గా ఉండటం ఈ సదస్సుతో మరోసారి స్పష్టమైంది.
Read More: Read Today’s E-paper News in Telugu
