తెలంగాణ పత్రిక (APR.12) : MLA Anil Jadav. బోథ్ మండలంలోని ధన్నూర్ గ్రామస్తులు ఎమ్మెల్యే అనిల్ జాధవ్ ని గత నెల 30 వ తేదీన కలిసి తమ గ్రామంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరగా తక్షణమే ఎమ్మెల్యే కలెక్టర్ కి లేఖ రాసి చారవాణిలో సంప్రదించి జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా దన్నూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్ర ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే అనిల్ జాధవ్ హాజరయి కొనుగోలు కేంద్రం ను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యే అనిల్ జాధవ్ ని అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.


ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, ఫాక్స్ చైర్మన్ ప్రశాంత్, మాజీ జెడ్పిటిసి సంధ్యారాణి, మాజీ సర్పంచ్ సురేందర్ యాదవ్, గొర్ల రాజు యాదవ్,మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. MLA Anil Jadav ఈ కొత్త కొనుగోలు కేంద్రం ధన్నూర్ రైతుల జీవితాల్లో మార్పు తెస్తుంది. ప్రభుత్వం, స్థానిక నాయకులు కలిసి చేసిన ఈ కృషి 2025లో కృషి రంగ అభివృద్ధికి నాంది పలుకుతోంది.
2025 నాటి మెరుగుపరచబడిన సౌకర్యాలు
- డిజిటల్ కొనుగోలు సౌకర్యం ఆన్లైన్ బిడ్డింగ్ & SMS అప్డేట్స్.
- న్యాయమైన ధరల నిర్ణయానికి AI-ఆధారిత మార్కెట్ ట్రెండ్ విశ్లేషణ.
- రైతులకు తక్షణ పేమెంట్ సిస్టమ్ (UPI/బ్యాంక్ లింక్డ్).
Read More: హనుమాన్ జయంతి సందర్భంగా మద్యం దుకాణాలు బంద్