TELANGANA PATRIKA (MAY 14) , Minority residential schools admission Telangana 2025 ప్రకారం, జిల్లాలోని ప్రభుత్వ మైనారిటీ వసతి గృహ విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రకటించారు.

Minority residential schools admission Telangana 2025 పోస్టర్ ఆవిష్కరణ
బుధవారం కలెక్టర్ ఛాంబర్లో అధికారులతో కలిసి మైనారిటీ ప్రవేశాలకు సంబంధించి పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, 2025–26 విద్యా సంవత్సరానికి గాను మైనారిటీ వసతి గృహాల్లో 5వ తరగతి, ఇంటర్ 1వ సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు. అదనంగా, 6, 7, 8వ తరగతుల్లో పరిమిత సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె సూచించారు. వసతి గృహాల్లో ఉచిత పాఠ్యపుస్తకాలు, నాణ్యమైన బోధన, సురక్షిత వసతి, రుచికరమైన భోజనం లభిస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మోహన్ సింగ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. దరఖాస్తు విధానం, అర్హతల వివరాలకు జిల్లా మైనారిటీ శాఖను సంప్రదించాలని సూచించారు.
Also Read : Indiramma housing scheme beneficiaries Telangana: లబ్ధిదారులు త్వరగా ఇండ్లు నిర్మించుకోవాలి
2 Comments on “Minority residential schools admission Telangana 2025: మైనారిటీ విద్యార్థులకు ప్రవేశాల కోసం దరఖాస్తుల ఆహ్వానం”