మండలంలోని సర్వాపూర్-కొత్తపల్లి గ్రామంలో నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆదివారం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆవిష్కరించారు. అనంతరం విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘ప్రపంచంలో యుద్ధాలతో సాధించలేనిది, జ్ఞానంతో సాధించిన వ్యక్తి డాక్టర్ అంబేద్కర్. చిన్నతనంలో తండ్రి ఇచ్చిన ప్రేరణతో ఆయన ప్రపంచ స్థాయి విద్యార్హతలు సంపాదించి, భారత రాజ్యాంగాన్ని రచించారు. అణచివేత ఎదుర్కొన్నా, క్రమశిక్షణతో ముందుకు సాగారు’’ అని అన్నారు.
కార్యక్రమంలో సీఐ నీలం రవి, ఎస్ఐ నరేష్, ఏఎంసీ చైర్మన్ బత్తిని మల్లీశ్వరి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు ముత్యం శంకర్, దొంగ ఆనంద రెడ్డి, మాక లక్ష్మణ్, దారం ఆదిరెడ్డి, బోట్ల ప్రసాద్, శనిగరపు తిరుపతి, ఏఎంసీ డైరెక్టర్ కనకట్ల జలంధర్ తదితరులు పాల్గొన్నారు.
Read More: Medipally Sathyam: టింబర్ డిపో – గాయత్రి కో- ఆపరేటివ్ బ్యాంకు ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యం