Marri Niranjan reddy: ఆదిభట్ల సీతారాముల కళ్యాణం లో పాల్గొన్నారు ఆదిభట్ల మున్సిపాలిటీ ఏప్రిల్ 06 (తెలంగాణ పత్రిక):-ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిభట్లలో జరిగిన సీతారాముల కల్యాణ మహోత్సవంలో ముఖ్యఅతిథిగా టిపిసిసి సభ్యులు,ఆదిభట్ల మున్సిపాలిటీ తాజా మాజీ చైర్మన్ మరి నిరంజన్ రెడ్డి పాల్గోన్నారు.ఈ సందర్బంగా మర్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ధర్మాన్ని కాపాడటంలో రామున్ని మించిన దేవుడు లేడని అన్నారు.సీతారాముల పవిత్రబంధం భావితరాలకు ఆదర్శమని,శ్రీ రామచంద్రుడి పాలన ప్రపంచ దేశాలకు స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు. ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ ప్రజలు,బంధుమిత్రులు,వివిధ పార్టీల నాయకులు,భక్తులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు


Read More: Click for various News papers and post