TELANGANAPATRIKA (June 21): Local Elections Congress Strategy. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త ఒక సైనికుడిగా పనిచేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.

Local Elections Congress Strategy కార్యకర్తలతో సమీక్షా సమావేశం
కల్లూరు మున్సిపాలిటీ కేంద్రంలోని డి.ఎన్.పి ఫంక్షన్ హాల్లో శనివారం నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పాల్గొన్నారు. ఆయనతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ పాల్గొన్నారు.

ప్రారంభంలో అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన మృతులకు మౌనం పాటించి నివాళులు అర్పించారు.
రాష్ట్ర నాయకత్వంపై విశ్వాసం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుల నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధి జరుగుతోందని మంత్రి చెప్పారు. సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.
Local Elections Congress Strategy స్థానిక ఎన్నికలపై వ్యూహం
సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను నిలబెట్టాలని పిలుపునిచ్చారు. వర్గ విభేదాలు లేకుండా కాంగ్రెస్ అభ్యర్థి గెలవాల్సిన అవసరం ఉందని మంత్రి స్పష్టం చేశారు.
ప్రతి గడపకు కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలను చేరవేసేలా కార్యకర్తలు ముందుకు రావాలని సూచించారు. ఎదురు పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని నేతలు, కార్యకర్తలకు సూచనలు అందించారు.
పాల్గొన్న నేతలు
ఈ సమావేశంలో రాష్ట్ర ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వ విజయబాబు, సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, కల్లూరు ఏఎంసీ చైర్మన్ భాగం నీరజాదేవి, ఆలయ కమిటీ చైర్మన్ దార రంగ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆళ్లకుంట నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu
One Comment on “Local Elections Congress Strategy : స్థానిక సంస్థలలో సత్తా చాటాలని మంత్రి పిలుపు.!”