ఇంటిపై పిడుగుపాటు – మహిళ గాయపడిన ఘటన..!

TELANGANA PATRIKA(MAY27) , మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఇంటిపై పిడుగుపాటు మల్యాల మండలంలోని తాటిపల్లి గ్రామంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం సమయంలో ఒక ఇంటిపై పిడుగు పడింది. ఈ ఘటనలో అదే ఇంట్లో నివాసముండే జెరిపోతుల సుమతి (30) గాయపడింది.

ఇంటిపై పిడుగుపాటు పిడుగు ప్రభావంతో ఇంట్లో షార్ట్ సర్క్యూట్

పిడుగు ప్రభావంతో ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడింది. దీంతో సుమతికి చేతిపై బొబ్బలు పడ్డాయి. అంతేకాదు, చెవులకు వినపడకపోవడం వంటి పరిణామాలు కనిపించాయి. సుమతి గారి ఆరోగ్యం ప్రస్తుతం మెరుగవుతున్నట్లు సమాచారం.

108 అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలింపు

ఈ సంఘటన జరిగిన వెంటనే మల్యాల ఎస్‌ఐ నరేష్ కుమార్ స్పందించి, 108 అంబులెన్స్‌ను సమయానికే ఏర్పాటు చేశారు. గాయపడిన సుమతిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పిల్లలతో కలిసి ఇంట్లో ఉన్న సమయంలో ఘటన
ఈ ఘటన సమయంలో సుమతితో పాటు ఆమె కుమారుడు ప్రణీష్ (5), కుమార్తె ఆరాధ్య (8) ఇంట్లో ఉన్నారు. అదృష్టవశాత్తూ వారు గాయపడలేదు. గ్రామస్తులు ఈ ఘటనపై కలవరపడుతున్నారు.

Read More: Read Today’s E-paper News in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *