Telangana patrika(jun 8) , Kondagattu: మల్యాల మండలంలో దారుణం జరిగింది. కొండగట్టు మెట్ల దారి పక్కన ఉప్పు రమణారెడ్డి అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. తహశీల్దార్ సమక్షంలో పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం చేశారు. మృతుడి అన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు సీఐ నీలం రవి తెలిపారు. ఈ హత్య కేసులో 8 మంది నిందితులను అదుపులో తీసుకొని విచారణ చేపడుతున్నట్లు హత్య వెనుక కారణాలపై విచారణ కొనసాగుతోందన్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. ఆయనతోపాటు ఎస్ఐ నరేష్ కుమార్ ఉన్నారు.ఈ హత్య సేమ్ దృశ్యం సినిమా లాగానే రిపీట్ అయింది పాత కక్షలు నేపథ్యంలో జూన్ 2న తేదీన రమణారెడ్డిని తీవ్రంగా చితకబాది ప్రాణాలతో భూమిలో పాతిపెట్టారు దుండగులు కొండగుట్ట పైకి వెళ్లే మట్ల దారి పక్కన ఉపాధి హామీ కోసం తీసిన గుంతల ప్రాతిపెట్టారు.

Kondagattu సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు
సమాచారం అందుకున్న వెంటనే సీఐ నీలం రవి నేతృత్వంలో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని వెలికితీసి, తహశీల్దార్ సమక్షంలో పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
కేసు నమోదు – 8 మంది నిందితులు అదుపులో
మృతుని అన్న ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్టు సీఐ నీలం రవి తెలిపారు. ఇప్పటివరకు 8 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నామని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఆయనతో పాటు ఎస్ఐ నరేష్ కుమార్ కూడా సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
| అంశం | వివరాలు |
|---|---|
| సంఘటన స్థలం | మల్యాల మండలం |
| మృతుడు | ఉప్పు రమణారెడ్డి |
| ఫిర్యాదు | మృతుని అన్న ఆధారంగా |
| బాధితులు | 8 మంది అదుపులో |
| దర్యాప్తు అధికారులు | సీఐ నీలం రవి |
Read More: Read Today’s E-paper News in Telugu
