
TELANGANA PATRIKA(MAY 22) , Kondagattu: జగిత్యాల జిల్లా కొండగట్టులో మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించిన పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు గురువారంతో ముగిశాయి.

కొండగట్టులో భక్తుల సందడి
రాష్ట్ర నలుమూలల నుండి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. వర్షం సైతం లెక్కచేయకుండా భక్తులు తండాపతండాలుగా తరలివచ్చి దీక్ష విరమించుకున్నారు. 2 లక్షల మంది స్వామివారిని దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. మరో నాలుగు రోజుల వరకు భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉందని ఆలయ వర్గాలు తెలిపారు.

కొండగట్టు భక్తులకు మజ్జిగ పంపిణి చేసిన ఎమ్మెల్యే
పొన్నం సత్తయ్య ట్రస్ట్ వారు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభించి భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు అయన వెంట పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ సిబ్బందితో విజయవంతంగా ముగియడంతో ఈవో శ్రీకాంత్ రావు జగిత్యాల డిఎస్పి రఘు చందర్, సీఐ నీలం రవి, పలువురు పాత్రికేయులకు సన్మానించారు.
Also Read: Hanuman Jayanti 2025 – కొండగట్టు ఆలయం లో భక్తుల రద్దీ