TELANGANAPATRIKA (June 17): Kids Park Inauguration by SP .బోథ్, ఆదిలాబాద్ జిల్లా: పిల్లల ఆరోగ్యం, చదువు మరియు సమగ్ర అభివృద్ధికి ఉద్దేశించిన “చిన్నారుల పార్కు”ను గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఎఎస్పీ కాజల్ సింగ్ ఐపీఎస్ పాల్గొన్నారు.

Kids Park Inauguration by SP చిన్నారుల ఆరోగ్యం–చదువు పై దృష్టి అవసరం
ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ, “పిల్లలు పాఠశాల విద్యతో పాటు వ్యాయామం, ఆటలు కూడా అనుసంధానించుకోవాలి. ఆరోగ్యంగా పెరిగేందుకు ఇది కీలకం” అని తెలిపారు. పిల్లలు పార్క్ను వినియోగించుకుంటూ, చదువుపై దృష్టి సారించాలని కోరారు.
పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలి
ఈ సందర్భంగా ఎస్పీ పోలీస్ స్టేషన్ పరిశీలన చేశారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ముఖ్యంగా, ఫిర్యాదుదారుల పట్ల గౌరవంతో వ్యవహరించాలని, రికార్డులు సమర్థంగా నిర్వహించాలన్నారు. రానున్న పంచాయతీ ఎన్నికలలో విపిఓ విధానాన్ని అమలు చేయాలని స్పష్టం చేశారు.
“డయల్ 100” సేవలపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలి
డయల్ 100 ద్వారా పోలీస్ సేవలు అందుబాటులో ఉన్నాయని, గ్రామాలలో పోలీసులు ప్రజల కోసం విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రజలతో మమేకమవుతూ పనిచేయడం పోలీసుల ప్రధాన కర్తవ్యమని సూచించారు.
Read More: Read Today’s E-paper News in Telugu
One Comment on “Kids Park Inauguration by SP : జిల్లా ఎస్పీ చేతుల మీదుగా చిన్నారుల కోసం పార్కు ప్రారంభం..!”