ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత: చేసిన “దెయ్యాలు” వ్యాఖ్యలు టీఆర్ఎస్ లో అంతర్గత ఘర్షణల సంకేతమేనా?

TELANGANA PATRIKA (MAY24) , మాజీ సీఎం కేసీఆర్‌ను దేవుడితో పోలుస్తూ.. ఆయన చుట్టూ “దెయ్యాలు” ఉన్నాయి అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి.

ఇంతకీ ఆ “దెయ్యాలు” ఎవరు?

  • కవిత వ్యాఖ్యల నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు ఊపందుకున్నాయి.
  • పార్టీ లోపలి నేతల మధ్య విభేదాలు ఉన్నాయా?
  • ముఖ్యంగా కేటీఆర్, హరీశ్ రావు, కవిత మధ్య నాజూకు సంబంధాలేనా?
  • పార్టీ పతనానికి కారణమైన అంతర్గత వర్గాలపై కవిత ఈ సంకేతాలిచ్చిందా?

ఈ వ్యాఖ్యలు సూక్ష్మంగా చేసిన విమర్శలేనా, లేదా స్పష్టమైన సంకేతాలేనా అన్నది తేలాలి.

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యల దుర్వినియోగం..?

ప్రస్తుతంగా BRS పార్టీకి ఊపు తగ్గిన సమయంలో, ఈ వ్యాఖ్యలు విపక్షాలకు ఆయుధంగా మారే అవకాశముంది.
విపక్షాలు ఇప్పటికే –

“బీఆర్ఎస్ కుటుంబ రాజకీయాల్లో చీలికలు వస్తున్నాయి”,

“కేసీఆర్ తరువాత నాయకత్వం పై బాధలు ఉన్నాయి” అంటూ విమర్శలు చేస్తున్నారు.

కేటీఆర్, హరీశ్ ఎలా స్పందిస్తారు?

ఇప్పటికీ ఈ వ్యాఖ్యలపై

కేటీఆర్ గానీ , హరీశ్ రావు గానీ ప్రత్యక్షంగా స్పందించలేదు.

కానీ, వారి మౌనం స్వాభావికంగా భావించాలా? లేక అంతర్గతంగా కలవరం ఉందని భావించాలా? అనే చర్చ మాత్రం ఊపందుకుంది.

Also Read : కవిత సంచలన లేఖ: మాజీ సీఎం తన తండ్రి కి 7 పేజీల లేఖ.. !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *