Kavitha Legislative Council Speech: మాజీ బీఆర్ఎస్ నేత, కేసీఆర్ కుమార్తె కవిత శాసనమండలిలో చేసిన ప్రసంగం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. తీవ్ర భావోద్వేగానికి లోనవుతూ మాట్లాడిన కవిత, తన జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలను స్పష్టంగా వెల్లడించారు.

Kavitha Legislative Council Speech “నన్ను లక్ష్యంగా చేసుకున్నారు”
బీజేపీ రాజకీయ కక్షతో తనపై ఈడీ, సీబీఐ కేసులు పెట్టి జైలుకు పంపించిందని కవిత ఆరోపించారు. అయితే ఆ సమయంలో తాను ప్రాణాల మీదకు తెచ్చుకుని పోరాడుతున్నప్పుడు తన పార్టీ తనకు అండగా నిలబడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
“కేసీఆర్పై ఆరోపణలు వస్తే నేనే ముందుండేదాన్ని”
కేసీఆర్పై అవినీతి ఆరోపణలు వచ్చిన ప్రతిసారి తానే బహిరంగంగా రక్షణగా నిలిచానని కవిత గుర్తు చేశారు. కానీ తనకు అవసరమైన సమయంలో మాత్రం పార్టీ నుంచి సరైన మద్దతు లభించలేదని వాపోయారు.
వివరణ అడగకుండా సస్పెన్షన్
తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి ముందు ఒక్కసారి కూడా వివరణ అడగలేదని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. నైతిక విలువలు కోల్పోయిన పార్టీ నుంచి బయటపడటం తనకు ఊరట కలిగించిందని చెప్పారు.
మీడియా కూడా అండగా నిలబడలేదన్న కవిత
గత ఎనిమిదేళ్లుగా ప్రజల కోసం తాను చేసిన పనులను కావాలని అడ్డుకున్నారని, పార్టీ అనుకూల మీడియా ఛానెల్స్, పత్రికలు కూడా తనకు మద్దతు ఇవ్వలేదని ఆరోపించారు.
అవినీతి ఆరోపణలపై ఘాటు వ్యాఖ్యలు
అంబేద్కర్ విగ్రహం నుంచి అమరజ్యోతి అంశం వరకు పలు వ్యవహారాల్లో అవినీతి చోటుచేసుకుందని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నలు అడిగిన కార్యకర్తలను, నేరుగా మాట్లాడినవారిని కావాలని పక్కన పెట్టారని అన్నారు.
“ఇది ఆస్తి వివాదం కాదు.. ఆత్మగౌరవ పోరాటం”
తన పోరాటం ఆస్తి కోసమో, వ్యక్తిగత లాభాల కోసమో కాదని స్పష్టం చేసిన కవిత,
“ఇది నా ఆత్మగౌరవం కోసం చేసిన పోరాటం” అని తెలిపారు.
తన ఇద్దరు కుమారులపై, దేవుడిపై ప్రమాణం చేస్తూ మాట్లాడిన కవిత, నైతికత లేని పార్టీలో కొనసాగలేకనే తాను బయటకు వచ్చానని చెప్పారు. తన రాజీనామాను ఆమోదించాలని కోరారు.
Kavitha Legislative Council Speech చైర్మన్ స్పందన
కవిత ప్రసంగంపై స్పందించిన శాసనమండలి చైర్మన్, ఆమె వేదన అర్థమవుతోందని తెలిపారు. రాజీనామా నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని ఆమెను కోరారు.
Read More: Read Today’s E-paper News in Telugu
