
TELANGANA PATRIKA (MAY27) , Collector Kamareddy,కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మంగళవారం దోమకొండ మండలంలోని యూనిఫాం కుట్టు కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, “విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ జరగాలి” అని అధికారులను ఆదేశించారు.
జిల్లాలో విద్యార్థుల కోసం యూనిఫాం వివరాలు
ఈ విద్యా సంవత్సరానికి గాను మొత్తం 72,081 విద్యార్థులకు యూనిఫాములు పంపిణీ చేయాల్సి ఉంది. ఇందులో 34428 మగ పిల్లలు మరియు 37653 ఆడపిల్లలు ఉండగా, ఇప్పటివరకు తయారైన యూనిఫాముల వివరాలను కలెక్టర్ సమీక్షించారు. కొలతలు, కుట్టు విధానం, కటింగ్ ప్రక్రియలను కూడా పర్యవేక్షించారు.
మహిళా సంఘాల ద్వార నిర్వహణ – ఆదాయంపై ఫోకస్
జిల్లాలోని 183 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం ద్వారా రూ. 3.20 కోట్లు బెనిఫిట్ అందిందని కలెక్టర్ తెలిపారు. ఈ విధంగా మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడాన్ని వారు ప్రశంసించారు.
Collector Kamareddy ఇతర అభివృద్ధి కార్యక్రమాలు..
MPDO కార్యాలయంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ మోడల్ ఇంటిని కలెక్టర్ పరిశీలించారు. పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
బోర్వెల్ రేచార్జ్ స్ట్రక్చర్స్ త్వరితగతిన నిర్మించాలని, రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.
ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ సందర్శించి, మహిళా సంఘాల ఆర్థిక అభివృద్ధి పై ఉత్సాహం వ్యక్తం చేశారు.
పాల్గొన్న అధికారులు
ఈ కార్యక్రమాల్లో గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, ఉద్యానశాఖాధికారి జ్యోతి, డిపిఎం రమేష్, తహసీల్దార్, ఎంపీడీఓ మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu