Jubilee Hills Bypoll: జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం బైఎలక్షన్లో BRS పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీత పేరును అధికారికంగా ప్రకటించింది. ఆమె దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారి భార్య.

BRS అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ఈ నిర్ణయం తీసుకుంటూ, గోపినాథ్ ప్రజా సేవలను గుర్తుచేసి, ఆయన వారసత్వాన్ని కొనసాగించగల వ్యక్తిగా సునీతను ముందుకు తీసుకువచ్చారు.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, సునీత ఇప్పటికే స్థానిక కార్యకర్తలతో కలసి ప్రజా సమస్యలను తెలుసుకుంటూ చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో, పార్టీ అభ్యర్థిత్వం ఆమెకు అదనపు బలాన్నిచ్చే అవకాశం ఉంది.
సునీత స్పందిస్తూ – “గోపినాథ్ గారి సేవా ధ్యేయాన్ని కొనసాగిస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తాను. పార్టీ నాయకత్వం నాపై ఉంచిన నమ్మకాన్ని ఫలప్రదం చేస్తాను” అని అన్నారు.
Jubilee Hills Bypoll 2025
ఈ బైపోల్స్ రాష్ట్ర రాజకీయ పరిణామాలకూ కీలకంగా మారనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu

One Comment on “Jubilee Hills Bypoll : జూబ్లీ హిల్స్ బైపోల్స్కి BRS అభ్యర్థిగా మాగంటి సునీత..!”