Advertisement

Janasena Sircilla: సిరిసిల్ల మున్సిపల్ బరిలో జనసేన.. “చేనేత అంటే సిరిసిల్ల” అంటూ RK సాగర్

Janasena Sircilla: 200 మంది క్యాడర్ తో కలిపి పార్టీలో చేరిన నాయకులు. యువతకు రాజకీయాల్లోకి రావాలని పిలుపు

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement
Jana Sena in Sirsilla Municipal Polls: RK Sagar Calls for Youth Entry latest-news

Janasena Sircilla : రాబోయే మునిసిపల్ ఎన్నికల్లో సిరిసిల్ల మున్సిపాలిటీ లో పోటీ చేస్తామని జనసేన పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి ఆర్.కె. సాగర్ శనివారం స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఈ మాటలు చెప్పారు.

Advertisement

200 మంది క్యాడర్ తో కలిపి పార్టీలో చేరిన నాయకులు

  • సమావేశం సందర్భంగా, సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీ లోని 15 వార్డులకు చెందిన వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలతో కలిపి 200 మంది జనసేన పార్టీలో చేరారు.
  • జనసేన పార్టీ ప్రచార కార్యదర్శి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి ఆర్.కె. సాగర్ సమక్షంలో వారు చేరారు.
  • జనసేన పార్టీ అడ్ హక్ కమిటీ సభ్యుడు పెంటల మహేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
  • చేరిన వారికి కండువాలు కప్పి ఆర్.కె. సాగర్ పార్టీలోకి ఆహ్వానించారు.
pentala mahesh team jenasena siricilla 2026 news jenasena

“చేనేత అంటే సిరిసిల్ల”: RK సాగర్ సందేశం

  • జనసేన పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి ఆర్.కె. సాగర్ మాట్లాడుతూ, “సిరిసిల్ల అంటే చేనేత.. చేనేత అంటే సిరిసిల్ల” అని కొనియాడారు.
  • చేనేత కార్మికులకు పవన్ కళ్యాణ్ గౌరవం ఇస్తారని, అందుకే ఆయన నిరంతరం చేనేత వస్త్రాలను ధరిస్తారని ఆయన గుర్తుచేశారు.
  • జనసేన పార్టీ చేనేత కార్మికులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
pentala mehesh team jenasena siricilla

Janasena Sircilla – యువతకు పిలుపు

  • రాజకీయాల్లో మార్పు రావాలంటే నిరుద్యోగులు, యువత రాజకీయాల్లోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
  • వారికి జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
  • తెలంగాణ గడ్డ మీద పురుడు పోసుకున్న జనసేన పార్టీ, నేటికి 12 ఏళ్లు పూర్తి చేసుకుందని, ఈ పార్టీకి యువతే అసలైన పునాది అని ఆయన అన్నారు.
  • సిరిసిల్ల లాంటి చైతన్యవంతమైన గడ్డపై జనసేన ఉనికిని చాటుకోవడం ద్వారా రాబోయే ఎన్నికల్లో రాణించాలని తెలిపారు.

సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు

ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన నాయకుడు గోకుల రవీందర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు సురేష్ రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులు చల్లా శివారెడ్డి, పైసా మోజెస్, పార్టీ రాష్ట్ర విద్యార్థి నాయకులు మహేష్ పెంటల సిరిసిల్ల నాయకులు హరికృష్ణ, వంగరి సాయికిరణ్, అల్లే శ్రీకాంత్, సందిరి శ్రీకాంత్, నరేష్, రవికాంత్, అడెపు సంతోష్, కట్ల సాయి, అన్నారం సాయి, మనోజ్ లతో పాటు జనసేన ముఖ్య నాయకులు, వీరమహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

vangari saikiran team jenasena siricilla 2026
ganesh boorla jenasena rajanna siricilla team

Advertisement
Advertisement

About Ganeshghani

GaneshGhani is a Editor with 1.5 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →