MI VS RR ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన కీలకమైన పోరులో ముంబై 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు 217/2 పరుగుల భారీ స్కోర్ చేసింది. రికెల్టన్ (61), రోహిత్ శర్మ (53), సూర్యకుమార్ యాదవ్ (48 నాటౌట్), హార్దిక్ పాండ్యా (48 నాటౌట్) అద్భుతంగా రాణించారు. రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ముంబై బ్యాటింగ్కు అదృష్టం కలిసి వచ్చింది. బౌలింగ్ విభాగంలో రాజస్థాన్ తడబడడంతో ముంబై స్కోర్ ఆపలేకపోయింది.


MI VS RR ఆరంభం నుంచే రాజస్థాన్ రాయల్స్ ఢీలా!
లక్ష్యాన్ని చేధించేందుకు దిగిన రాజస్థాన్ రాయల్స్ ఆరంభం నుంచే ఒత్తిడిలో పడింది. వైభవ్ సూర్యవంశీ డక్కి వెనుదిరగడం, యశస్వి జైస్వాల్ త్వరగా ఔట్ కావడంతో ఇన్నింగ్స్ కుదేలైంది. చివరికి 117 పరుగులకే ఆల్ఔట్ అయింది. ఈ ఓటమితో పాటు పాయింట్ల పట్టికలో తక్కువ నెట్ రన్రేట్ కారణంగా రాజస్థాన్ ప్లేఆఫ్ అవకాశాలను కోల్పోయింది. మరోవైపు, ముంబై ఇండియన్స్ టాప్ 1 లో నిలవడంతో ప్లేఆఫ్ దిశగా అడుగులు వేసింది.
Read More: Read Today’s E-paper News in Telugu