Indiramma Housing Scheme Telangana: వలిగొండ మండలంలో లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే కుంభం

TELANGANAPATRIKA (june 10): Indiramma Housing Scheme Telangana. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని దేవిశ్రీ గార్డెన్లో, ఇందిరమ్మ ఇండ్లకు అర్హులైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అందజేశారు.

Join WhatsApp Group Join Now

Indiramma Housing Scheme Telangana ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ప్రక్రియ

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు లబ్ధిదారులు 400–600 చదరపు అడుగుల మధ్యలో ఇండ్లు నిర్మించుకోవాలని సూచించారు. మండల వ్యాప్తంగా మొత్తం 586 లబ్ధిదారులకు ఇండ్లు మంజూరయ్యాయని, మిగిలిన వారి ప్రక్రియను ఒక వారం లోపు పూర్తిచేస్తామని తెలిపారు.

సాయాలు మరియు నిబంధనలు

ప్రతి లబ్ధిదారుడికి నాలుగు విడతలలో రూ.5 లక్షల వరకు ఆర్థిక సాయం ప్రభుత్వం అందిస్తుందని, నిర్మాణాలు నెలరోజుల్లో ప్రారంభించకపోతే మంజూరు రద్దవుతుందని హెచ్చరించారు. ఇసుక ఉచితంగా సరఫరా చేస్తామని తెలిపారు.

దళారుల ఆశ్రయించవద్దు – న్యాయంగా అందించే సహాయం

ఇళ్ల నిర్మాణ నిధుల కోసం అధికారులు, దళారులను ఆశ్రయించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఏ రూపంలోనూ లంచం చెల్లించకూడదని, ప్రభుత్వం నేరుగా సాయం చేస్తుందని తెలిపారు.

పాల్గొన్న నాయకులు, అధికారులు

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు కంకల కిష్టయ్య, ఎఎంసి చైర్మన్ భీమా నాయక్, ఆర్డీఓ శేఖర్ రెడ్డి, తహసీల్దార్ దశరథ తదితరులు పాల్గొన్నారు.

Read More: Read Today’s E-paper News in Telugu

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *